మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం కేంద్రానికి చెందిన అమ్రీన్ బేగం ఇటీవల అనారోగ్యానికి గురై నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరడంతో ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి తదుపరి మెరుగైన చికిత్స కొరకు రూ.2 లక్షల ఎల్వొసి మంజూరు చేయించి ఎల్ఓసి కాపీ ని వారి కుటుంబ సభ్యులకు సోమవారం హైదరాబాద్ లోని నివాసంలో అందజేశారు. నిరుపేదలమైన మాకు మెరుగైన వైద్య చికిత్స కొరకు రూ.2 లక్ష ఎల్ఓసి మంజూరు చేసిన ప్రశాంత్ రెడ్డి మేలు మర్చి పోలేమని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాజి మంత్రి,ఎమ్మెల్యే వేములకు కృతజ్ఞతలు తెలియజేసారు.