విశాఖ, బతుకమ్మ : విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య కు గురయ్యాడు. మాధవధార కుంచుమాంబ అమ్మవారి పండుగలో ఇద్దరి యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. యువకులు ఒకరిపై మరొకరు కత్తులతో దాడి చేసున్నారు. ఈదాడిలో మాసపు లోహిత్ అనే యువకుడు మృతి చెందాడు. ముందస్తు ప్లాన్ ప్రకారమే ఈదాడికి దిగినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. మృతుడిని నేరచరిత్ర కలిగిన రౌడీ షీటర్ గా పోలీసులు గుర్తించారు. నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
