కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి పీఏసీఎస్ఎ ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతులు సాగుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో యూరియా కొరతతో గంటల తరబడి సొసైటీల ముందు నిల్చుంటున్నారు. తాడ్వాయి పీఏసీఎస్ ఎదుట ఉదయం 5 గంటల నుంచి రైతులు యూరియా కోసం నిలుచున్నారు. యూరియా కొరత పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

