- ఒకరు మృతి.. మరోకరికి స్వల్ప గాయాలు
- 40 గొర్రెలు మృతి
రాజంపేట, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎన్ హెచ్ 44 హైవే పై రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. రోడ్డు ప్రమాదంలో 40 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మహబూబ్ నగర్ కు చెందిన గొర్రెల కాపరులు తన గొర్రెల మందను తీసుకొని వస్తున్న క్రమంలో అతివేగంగా వచ్చిన లారీ ఒకసారి గొర్రెల మంద పైనుండి వెళ్లడంతో గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా ఒక వ్యక్తి మృతి చెందగా మరొక వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
