27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రేషన్‌ షాపులకు చేరని బియ్యం…

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

లబ్ధి దారులకు రేషన్‌ సరుకులు పంపణీ చేసే చౌక ధరల దుకాణాలు స్టాక్‌ లేక వెలవెలబోతున్నాయి. ప్రతీ నెల ఒకటి నుంచి 15వ తేదీలోపు రేషన్‌ షాపుల్లో బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. రేషన్ బియ్యం రాకపోవడంతో రేషన్ లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో జూలై నెల కోటకు సంబందించిన రేషన్ బియ్యం ఇంకా ఇప్పటి వరకు రాకపోవడంతో రేషన్ దారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వేసవికాలంలో ఎండలు తీవ్రంగా ఉండడంతో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేశారు. కానీ ఈ నెలలో రేషన్ షాపులకు బియ్యం చేరలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రేషన్ దారులకు రేషన్ బియ్యం పంపిణీ చేయాలని రేషన్ దారులు కోరుతున్నారు.

More articles

Latest article