బతుకమ్మ బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పాతబస్తీలో గల చావడి వద్ద రెవెన్యూ సదస్సును అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతుల నుండి వచ్చిన వివిధ దరఖాస్తులను పరిశీలించారు. సమావేశంలో తాసిల్దార్ విటల్ మాట్లాడుతూ, “నేటి నుండి మూడు రోజుల పాటు పాతబస్తీ చావడి వద్ద రెవెన్యూ సదస్సులు నిర్వహించబడతాయ” అని పేర్కొన్నారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రైతులు భూ భారతి పోర్టల్ ను వినియోగించుకోవాలని సూచించారు.
