బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పెండింగ్లో ఉన్న పనులు వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. మంగళవారం డబుల్ బెడ్ రూమ్ లను పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పురోగతి వివరాలను అదనపు కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్యామేజ్ అయినా చోట మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వీణ ఆర్ ఐ బాలయ్య రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
