బాన్సువాడ , బతుకమ్మ : అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్లో గుండెల్లో నిలవాలని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ర్టీస్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. బాన్సువాడలోని పార్టీ కార్యాలయంలో సీఎం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కామారెడ్డి జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఖాలేఖ్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అసద్ బిన్ మోసీన్, సొసైటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి , అంజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ నార్ల రత్న కుమార్, నార్ల సూరి, రవీందర్, గోపాల్ రెడ్డి, ఎజాస్, బాబా, హకీం, వాహబ్, యువజన అధ్యక్షుడు మధు, గంగుల గంగారాం, జహీర్, తదితరులు పాల్గొన్నారు.
