- బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ సిటీ. బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్ట్ స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం ఆడుతున్నాడు అని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. బీసీ ల మీద రేవంత్ రెడ్డి కి కపట ప్రేమ.. న్యాయ వ్యవస్థ పైన సరైన అవగాహన లేకా కాలయాపన చేస్తున్నారన్నారు. బీసీ 42 శాతం, మైనార్టీ ముస్లిం లను 10 శాతం కలపడం బీసీ లకు తీవ్రమైన అన్యాయం అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ మీద రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. బీసీ లను మోసం చేసిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
