హైదరాబాద్, బతుకమ్మ: గంజాయి సేవిస్తూ నిజామాబాద్ కు చెందిన నలుగురు హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీఆర్ సీ రెసిడెన్సీ భవనంలో గంజాయి సేవిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఒకసారి పట్టుబడిని హైదరాబాద్ కుచెందిన ప్రియాంకరెడ్డితో నిజామాబాద్ కు చెందిన ఏ వెంకటేశ్, పి విజయారెడ్డి, ఎం రాహుల్, ఎస్ శివకుమార్ గంజాయి సేవిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరికి మత్తుపదార్థాలు ఎవరు విక్రయించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
