నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల విచారణ కమిషన్ ఏక సభ్య కమిషన్ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ శమీమ్ అక్తర్ కు ఎస్సీ రిజర్వేషన్ ల వర్గీకరణ చేయవద్దని జాతీయ మాలల ఐక్య వేదిక నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నీలగిరి రాజు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు వర్గీకరణ కు వ్యతిరేకం అని ఏబీసీడీ గా వర్గీకరించుట వల్ల ఎస్సీలు అందరు విచ్చిన్నం అవుతారని దళితులు కలిసి ఉంటే రాజ్యాధికారం సాధించవచ్చని కోరామని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా నాయకులుపులి జైపాల్, గైని మహేందర్, గైని దయసాగర్ పాల్గొన్నారు.
