నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.శివ ప్రసాద్, సూపరింటెండెంట్ పి.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ డా.బీవీ.నాగమోహన్, వైస్ ప్రిన్సిపాల్ డా.జలగం తిరుపతి రావు, ఏఓ మదుసూదన్, సూపరింటెండెంట్ పెద్దోళ్ల నాగరాజు, గంగాధర్, సిబ్బంది గోవింద్, సాయిబాబా, రవిచంద్ర, గాయత్రి, జ్యోతి, రంజిత్ పాల్గొన్నారు.
