రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదు రోజులపాటు రేణుక ఎల్లమ్మ మహోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సోమవారం నాలుగవ రోజు ఎల్లమ్మ బోనాలు నిర్వహించారు. అంగడి బజార్ నుండి ఎల్లమ్మ మందిరం వరకు మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా భాజా భజంత్రీలతో తరలివెళ్లారు. పోతురాజుల విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలలో గౌడ సంఘం అధ్యక్షులు గుండూరి విట్టల్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, రాజా గౌడ్, నారా గౌడ్, సతీష్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
