బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో ఉన్న ముళ్ళ పొదల వలన గత కొన్ని రోజులుగా రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దారి గుండా అక్కడక్కడ రోడ్డు మర్మత్తు పనులు కూడా చేపట్టకుండా గత ప్రభుత్వ నాయకులు వదిలేదడంతో ప్రజలకు మరీ కష్టతరమైంది. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు దృష్టికి కాంగ్రెస్ నాయకులైన షాకాపూర్ తుకారం తీసుకెళ్ళారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. తక్షణమే అనుమతి ఇచ్చి పనులు ప్రారంభించాలని ఆదేశించారని నాయకులు తుకారం తెలిపారు. ఈ సందర్బంగా కాలనీవాసులు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకులు ఖలీల్, అసద్ అలీ, దండోరా నాయకులు గంగారం సాయిని అశోక్, దర్పల్ గంగాధర్, దర్పల్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
