బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వర గ్రామం దగ్గర ఉన్న శేఖర్ సురేష్ దాబాల రోడ్డుకు అడ్డంగా ఉన్న ఫ్లెక్సీ బోర్డులను నేషనల్ హైవే అథారిటీ అధికారులు శనివారం తొలగించారు. జి.ఎం.ఆర్ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చిన ఫ్లెక్సీ బోర్డులను తీసివేయకపోవడంతో ఫ్లెక్సీ బోర్డులను నేషనల్ హైవే అథారిటీ, జి.ఎం.ఆర్ అధికారులు ఫ్లెక్సీ బోర్డును తీసివేయడం జరిగింది. వాహనాలు చాలాసార్లు ప్రమాదాలకు గురి కావడం వల్ల ఈ బోర్డులను తీసివేయడం జరిగిందని అధికారులు తెలియజేస్తున్నారు ఎలాంటి బోర్డులను నేషనల్ హైవే అథారిటీ స్థలంలో నిర్మించవద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ చరణ్ రామకృష్ణ రాము స్వామి జిఎంఆర్ సిబ్బంది ఉన్నారు.
