రుద్రూర్, బతుకమ్మ :
పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రుద్రూర్ గ్రామ సర్పంచ్ సునీత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శనివారం ఈద్ మీలాప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మైనారిటీ సోదరులకు శుభాకాంక్షలు తెలిపి తేనేటి విందును అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, ఉపసర్పంచ్ నిస్సార్ కాద్రి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కర్కా అశోక్, వార్డు సభ్యులు పోశెట్టి, బక్క శివకుమార్, కృష్ణ, కాంగ్రెస్ నాయకులు పోతురాజు లింగం, మేక వెంకన్న, పార్వతీ ప్రవీణ్, వడ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.