హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో ఇటీవల వర్షాలు దంచికొట్టాయి. అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవడం తో పలు ప్రాంతాల్లోని వాగులు పొంగిపొర్లాయి. గోదావరి, కృష్ణా నదుల్లోకి వరదనీరు పోటెత్తింది. భారీ వర్షాల కారణంగా రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతినడంతోపాటు.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, గత ఐదు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటు న్నారు. ఈ క్రమంలోనే మరో రెండురోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాయువ్య బంగాళా ఖాతం లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 24గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిం ది. రుతుపవన ద్రోణి కూడా కొనసాగు తోంది. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం, బుధవారా ల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల పరిధిలో భారీ వర్షాలు.
