. . . ప్రయాణికులు సహకరించాలని కోరిన అధికారులు
ఇందల్ వాయి, బతుకమ్మ :
గత నాలుగు రోజులుగా ఇందల్ వాయి, సిర్నాపల్లి స్టేషన్ల మధ్య లెవెల్ క్రాసింగ్ గేట్ నంబర్ 198 మూసివేత పొడిగింపుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే నుండి అధికారిక ప్రకట చేసినట్లు తెలిపారు. రైల్వే గేట్లను మూసివేతకు మరో రెండు రోజుల పాటు పొడిగింపు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ట్రాక్ మరమ్మతు పనులు, భారీ రైలు రద్దీ కారణంగా, బుధవారం సాయంత్రం రాకపోకలు పున : ప్రారంభం అవుతాయని రైల్వే అధికారులు తెలిపారు.
