బాల్కొండ, బతుకమ్మ :
బాల్కొండ మండలంలోని శ్రీరాంపూర్ గ్రామంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ పద్మ,ఎర్రన్న, ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో విద్యుత్ సంబందించిన సమస్యల కొరకు ఈ ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. శిధిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలు వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చాలని అధికారులకు సూచించారు. గ్రామంలో విద్యుత్ తో సమస్యలు వాటి పరిష్కారానికి సంబంధిచిన చర్యలు చేపట్టాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ విలాస్,సబ్ ఇంజనీర్ మహేష్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, విద్యుత్ శాఖ ఏఈ, ఈ ఈ, లైన్మెన్ కంచెట్టీ,లైన్ ఇన్స్పెక్టర్ షకీల్,నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు,
