వేల్పూర్, బతుకమ్మ: మండలోని పడగల్ లో ప్రజా పాలనలో విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ కార్యాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ చార్జి సునల్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి, గ్రామ అధ్యక్షుడు తలారి జాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలుమల గంగాధర్, మాజీ సర్పంచ్ దొరబాబు, మాజీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు రాజ ముత్యం, రమణ, రంజిత్, రాములు, రాజారెడ్డి, శాంతయ్య, గంగారాం, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
