ఇందూర్, బతుకమ్మ: వినాయకనగర్ సబ్ స్టేషన్ లో11కెవి కొత్త లైన్ ఏర్పాటు చేయడానికి 11కేవీ ఆర్యానగర్ 1, 2 వినాయక్ నగర్ 1 ఫీడర్ విద్యుత్ సరఫరాకు బుధవారం అంతరాయం కలుగుతుందని ఏడిఈ చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అనంతరాయం ఉంటుందన్నారు. పద్మా నగర్ రోడ్ నెంబర్ వన్, హనుమాన్ నగర్, యాదగిరి బాగ్, త్రిమూర్తి వెనకాల, కోటగల్లి, జండగల్లి, నకాష్ గల్లి, సాధుల్లా దర్గా, ఆర్య సమాజ్ రోడ్, సిర్నాపల్లి గడి, బజార్ దోబీ ఘాట్, గోసంగి కాలనీ, శివాలయం ప్రాంతం, తెలంగాణ తల్లి విగ్రహం, భీమారాయ మందిరం, 100 ఫీట్ల రోడ్, ఆకుల పాపన్న రోడ్డు, గణేష్ కాలనీ, అశోక్ అపార్ట్మెంట్, సాయి కృప నగర్, కాశి నగర్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
