- ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఎల్ అండ్ ఓ పోలీసుల సంయుక్త దాడులు
హైదరాబాద్, బతుకమ్మ : ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఎల్ అండ్ ఓ పోలీసుల సంయుక్తంగా ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్ ముఠాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నలుగురు డ్రగ్ పెడ్లర్ల అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 91 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రైలులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వరంగల్లో కోణార్క్ ఎక్స్ప్రెస్లో ముగ్గురిని అదుపులోకి తీసుకొని 32 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
