23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

33 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

పోలీస్ ప్రజావాణి కార్యక్రంమలో భాగంగా 33 ఫిర్యాదులు స్వీకరించినట్టుగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. సోమవారం నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదు దారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల ఎస్సై, సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని తెలుసుకొని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని సీపీ తెలిపారు. ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని తెలియజేశారు.

 

Police Commissioner receives 33 complaints
Police Commissioner receives 33 complaints
Police Commissioner receives 33 complaints
Police Commissioner receives 33 complaints
Police Commissioner receives 33 complaints
Police Commissioner receives 33 complaints
Police Commissioner receives 33 complaints
Police Commissioner receives 33 complaints
Police Commissioner receives 33 complaints
Police Commissioner receives 33 complaints

More articles

Latest article