పేకాట రాయుళ్ల అరెస్ట్

0 1,282

ఎడపల్లి, బతుకమ్మ : ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం పేకాట ఆడుతున్న వారిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ అంజయ్య తెలిపారు. ఎడపల్లిలోని పాడుబడ్డ రైస్ మిల్ లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, స్పెషల్ పార్టీ దాడి చేసిందని తెలిపారు. ఈ దాడిలో ఆరుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి ఆరు సెల్ ఫోన్లు, రూ.1570నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని తదుపరి చర్యల నిమిత్తం ఎడపల్లి ఎస్ఎచ్ఓకు అప్పగించినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.