దేవన్పల్లి, బతుకమ్మ : దేవన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దేవి విహార్ ఫేస్ 3లో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు దాడి చేసి తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.60,400 నగదు, రెండు బైకులు, తొమ్మిది సెల్ఫోన్లను సీజు చేసినట్లు తెలిపారు. దేవనపల్లి పీఎస్ పరిధిలో ఎవరైనా పేకాట ఆడిన, గంజాయి సేవించిన, గంజాయి అమ్మిన వారు వివరాలను తెలపాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఎవరైనా ఈ నేరాలకు పాల్ప పడినట్లు అయితే వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.
