కోటగిరి, బతుకమ్మ: రంజాన్ పవిత్ర మాసం సందర్బంగా కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్త మహమ్మద్ జుబేర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో తెలంగాణా వ్యవసాయ శాఖ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అమన్ యూత్ అసోసియేషన్ ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు శంకర్ పటేల్, పుప్పాల శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతు,మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మాజి జడ్పి కో ఆప్షన్ మెంబెర్ సిరాజ్, కొట్టం మనోహర్, జుబేర్, బాబు ఖాన్,జమీర్,హమీద్,బర్ల మధు,కూచి సిద్దులు, ముస్లీమ్ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
