24 C
Hyderabad
Sunday, August 2, 2026

సామాజిక బాధ్యతగా మొక్కలు నాటడం అభినందనీయం

Must read

📰 Generate e-Paper Clip

  •  ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంజయ్ గౌడ్

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని 58 డివిజన్ పరిధిలో దారు గల్లీలో మంగళవారం సాయంత్రం సామాజికవేత్త కాలనీవాసులు స్వచ్ఛందంగా మొక్కలు నాటారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అటవీ శాఖ రేంజ్ అధికారి సంజయ్ గౌడ్, ట్రాఫిక్ ఏసిపి నారాయణ, ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ, వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబులు హాజరై మొక్కలు నాటారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి సంజయ్ గౌడ్ మాట్లాడుతూ కాలి ప్రాంతాల్లో కేవలం అటవీ శాఖ అధికారులు మాత్రమే మొక్కలు నాటాలని ప్రజల్లో ఒక అపోహ ఉందని, దారు గల్లీకి చెందిన కాలనీవాసులు మొక్కలను ఎవరైనా నాటొచ్చని నిరూపించడం అభినందనీయమన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం, దోమలు నివారణ కోసం ప్రతి ఒక్కరూ తమ తమ ప్రదేశాలలో మొక్కలు నాటాలని మొక్కలు నాటడానికి తమను అడిగితే మొక్కలను అందించడానికి కూడా ముందు ఉంటామన్నారు నేడు చేసిన ఈ కాలనీవాసులు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని మొక్కలు నాటాలన్నారు. హమీద్ బిన్ గనం, నజర్ బీన్ సయ్యద్, యాసర్ బిన్ సయ్యద్, కాజీమ్ అలీ,ఆయుబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారిని కాలనీవాసులు శాలువాలతో సన్మానించారు.

More articles

Latest article