మోర్తాడ్, బతుకమ్మ : మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న దశరథ్ కు ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా ప్రధానం చేయడం సంతోషకరమైన విషయమని కళాశాల ప్రిన్సిపాల్ పెద్దన్న అన్నారు. ప్రొఫెసర్ లక్ష్మణ్ నాయక్ పర్యవేక్షణలో ఇన్ వెస్ట్ గేషన్ అన్ రెర్ ఎర్త్ మెటల్ అయాన్స్ సబిష్టి ట్యూషన్ ఎఫెక్ట్ ఆన్ ది స్ట్రక్చర్ ఆప్టికల్ ఎలక్ట్రికల్ మాగ్నెటిక్ యాక్టివిటీ ప్రాపర్టీస్ ఆఫ్ జింక్ మెగ్నీషియం స్పైనల్ డిప్రెట్స్ అనే అంశంపై చేసిన పరిశోధనలకు గాను పీహెచ్డీ పట్ట ప్రధాన చేయడం జరిగింది. ఈ సందర్భంగా గురువారం మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన సన్మాన కార్యక్రమంలో కళాశాల సిబ్బంది అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
