25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉద్యోగుల సమస్యలపై కలెక్టర్ కు వినతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉద్యోగుల సమస్యలపై ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కి శనివారం వినతి పత్రం అందజేశారు. ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర కమిటీ విడుదల చేసిన కార్యాచరణకు అనుగుణంగా సెప్టెంబర్ 1వ నుండి జిల్లా కేంద్రంలో నిర్వహించే ఉద్యమ కార్యచరణ, నిరసన కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, కో చైర్మన్లు ఎల్.రమణ రెడ్డి, ధర్మేందర్, వైస్ చైర్మన్లు నేతికుంట శేఖర్, ప్రశాంత్, రమణాచారి, జమీల్ ఉల్లా, ఫైనాన్స్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్, కార్యవర్గ సభ్యులు చిట్టి నారాయణరెడ్డి, పోల  శ్రీనివాస్, జాఫర్ హుస్సేన్, మాణిక్యం, మంగమ్మ, శ్రీవేణి, గీతారెడ్డి,సునీల్, స్వామి, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article