బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు లగచర్ల రైతుల అరెస్టుకు నిరసనకు కేసులు ఎత్తివేయాలని, లేనిపక్షంలో గ్రామ గ్రామాన ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అందే మహేందర్ రెడ్డి, భిక్కనూరు మాజీ సర్పంచ్ వేణు, రవీందర్ రెడ్డి, బాపురెడ్డి, రవి, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.