- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రజలు, పోలీసులు ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా మెలగాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. రంజాన్ మాసం చివరి శుక్రవారం ( జుమ్మాత్తుల్ విధా ) సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ గాంధీ చౌక్, కిషన్ గంజ్, మార్కెట్ క్లాక్ టవర్, నెహ్రు పార్క్ చౌరస్తా తదితర ప్రాంతాలను ఫుట్ మార్చ్ చేస్తూ పరిశీలించారు. ఈ సందర్బంగా పోలీస్

కమీషనర్ మాట్లాడుతూ ఎల్లప్పుడు ప్రజలు, పోలీస్ సిబ్బంది స్నేహ పూర్వకంగా, సోదర భావంతో మెలిగి, అందరూ వారి, వారి కుటుంబసభ్యులతో సుఖ సంతోషములతో వర్ధిల్లి సమాజంలో శాంతి స్థావనకు అందరు కృషి చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసిపి రాజ వెంకట్ రెడ్డి, టౌన్ ఎస్ఎచ్ఓ రఘుపతి, ట్రాఫిక్ సీఐ ప్రసాద్ , ఎస్.ఐలు పాల్గొన్నారు.

