నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ నిజామాబాద్ బ్రాంచ్లో గురువారం టర్మ్ పాలసీకి సంబంధించిన డెత్ క్లెయిమ్ మొత్తాన్ని నామినీకి అందజేశారు. నీరుడి బాబు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో టర్మ్ పాలసీ తీసుకున్న అనంతరం మరణించడంతో, పాలసీకి సంబంధించిన రూ.50,01,923 క్లెయిమ్ మొత్తాన్ని ఆయన భార్య, నామినీ నీరుడి కవితకు అందజేశారు. ఈ సందర్భంగా బ్రాంచ్ హెడ్ గుడ్ల కవిత, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ రాహుల్ కులకర్ణి, గణగణ నరేశ్, ఇట్టా స్వప్న, శ్రీపాదం రాహుల్ తదితర బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు. పాలసీదారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో జీవిత బీమా పాలసీలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా బ్రాంచ్ ప్రతినిధులు తెలిపారు.
