డిల్లీ,బతుకమ్మ : ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని భారత వాయుసేన స్పష్టం చేసింది. ఈఆపరేషన్ లో భాగంగా తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొంది. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా కచ్చితమైన నైపుణ్యాలతో పూర్తి చేశామని తెలిపింది. సైనిక చర్యలు కొనసాగుతున్నందున సమయానుకూలంగా వివరాలు వెల్లడిస్తామని, అధికారికంగా వెల్లడించే వరకు వదంతులు వ్యాప్తి చేయొద్దని కోరింది.
