బాన్సువాడ, బతుకమ్మ: బాన్సువాడ, దేశాయిపేట్ పీఏసీఎస్ ల ఆధ్వర్యంలో మండలంలోని దేశాయిపేట్, కొల్లూరు, నాగారం, బీర్కూర్ పీఏసీఎస్ పరిధిలోని కిష్టాపూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ సంస్థ చైర్మన్ కాసుల బాలరాజు, సొసైటీల చైర్మన్లు, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
