నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు చాల ఉత్సాహంగా, హోరా హోరీగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పదవ రోజు పురుషుల క్రికెట్ ఫైనల్ పోటీలను స్థానిక క్రీడా మైదానంలో ముఖ్య అతిథిగా వర్సిటీ ఉప కులపతి ఆచార్య టి.యాదగిరి రావు క్రీడాకారులను పరిచయం చేసుకొని,టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ స్వయంగా బ్యాటింగ్ చేస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ పోటీలలో పదకొండు జట్లు పాల్గొనగా శుక్రవారం పిజి సీనియర్స్, పిజి జూనియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ కార్యక్రమంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్,స్పోర్ట్స్ డైరెక్టర్ డా. జీ.బాలకిషన్, వర్సిటీ పిఆర్ఓ డైరెక్టర్ డా.పున్నయ్య, డాక్టర్ నాగరాజు పాత, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.బీ.ఆర్ నేత, జాదవ్ నరేష్(జూనియర్ అసిస్టెంట్), ఆఫిషియల్స్ తో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు.

