ఎల్లారెడ్డి, బతుకమ్మ : కరెంట్ షాక్ తో ఒకరు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలంలోని ఆజామాబాద్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన యువరాజ్ అనే వ్యక్తి వరిపంట కొయ్యడానికి హార్వెస్టర్ మిషన్ కు హెల్పర్ గా వచ్చాడు. గురువారం ఆజామాబాద్ గ్రామానికి చెందిన తౌరియా నాయక్ వరి పొలం కొయ్యడానికి వెళ్లాడు. మిషన్ పై వెళ్తున్న యువరాజుకు ప్రమాదవశాత్తు కరెంట్ వైర్లు తగిలి అక్కడిాకక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.