విద్యుత్ షాక్ తో ఒకరి మృతి

0 1,278

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. నూతనంగా నిర్మిస్తున్న ఆరోగ్య ఉప కేంద్ర నిర్మాణం పని చేస్తున్న మెదక్ జిల్లా రామాయంపేట చెందిన రాములు (40) ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.