బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని కోమటి చెరువు తండా గ్రామానికి చెందిన రమావత్ అనిల్(22) తాగుడుకు బానిసై శనివారం రాత్రి ఏదో గుర్తు తెలియని పురుగుల మందు తాగి చనిపోయినాడు అని మృతుని తండ్రి రమావత్ తులసి రామ్ ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేశారు.మృతునికి పెళ్లి అయినది కానీ సంతానం ఎవరూ లేరు అని ఎస్సై రాజు తెలిపారు. మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
