ఎల్లారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి రూరల్ చార్జ్ పరిధిలో హెచ్.ఎల్.బి డేటాలో గుర్తించిన పొరపాట్ల సవరణపై శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు డేటా నమోదు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. డేటాను ఖచ్చితంగా పరిశీలించి నమోదు చేయాలని, గోప్యతను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు. అలాగే పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేసి సరైన సమాచారం నమోదు చేయాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఎల్లారెడ్డి ఆర్డీఓ ప్రభాకర్ ఎంపీడీఓ పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో హెచ్.ఎల్.బి డేటా సేకరణ ప్రక్రియను పారదర్శకంగా, తప్పులు లేకుండా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రేమ్ కుమార్, ఎంపీడీఓ పాల్గొన్నారు.

