నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోనీ గాజులపేట్ లో సంతోష్ మాత యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండగను పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలునిర్వహించి , అన్నదానం సంతోష్ మాత యూత్ ఆధ్వర్యంలో వినాయకుని వద్ద నిర్వహించారు. అనంతరం వినాయకునికి పూలమాలలు వేసి నైవేద్యాన్ని సమర్పించారు.నగరం లో నీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడిపంటలతో ఆయురారోగ్యాలతో అందరు బాగుండాలని కోరారు. అలాగే వీధి వీధిలో వాడవాడలో వినాయకునికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సంతోషిమాత యూత్ ఆధ్వర్యంలో పిసిసి స్టేట్ సెక్రెటరీ రామ్ భూపాల్ , మాజీ కౌన్సిలర్ జగదీష్ కులకర్ణి ఘనంగా సన్మానించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

