బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని బొల్లక్ పల్లి గ్రామంలో మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులు ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలు పాటించి కొనుగోలు కేంద్రాలకు తెచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమవుతాయని తెలిపారు. దళారులకు ధాన్యం విక్రయించరాదని ఆయన సూచించారు.కార్యక్రమంలో ఏఈఓ ప్రదీప్ రెడ్డి ,రైతులు పాల్గొన్నారు.
