నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(నుడా) చైర్మన్ గా నియమితులైన కేశ వేణు సీఎం రేవంత్ రెడ్డిని శుక్రవారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. తనను నుడా చైర్మన్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపి సీఎంను సన్మానించారు. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తో కలిసి కేశ వేణు సీఎం రేవంత్ ను కలిశారు.
