నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మాలానా అబుల్ కలాం అజాద్ జన్మదిన వేడుకలను పురస్కరించుకోని జాతీయ విద్యా దినోత్సవంను నిర్వహించారు. నగరానికి చెందిన కాంగ్రెస్ నేత మోయిన్ యూనిస్ ఆధ్వర్యంలో ఖిల్లారోడ్డులోని నేషనల్ స్కూల్ లో విద్యార్థినిలకు సోమవారం ముఖ్య అతిథిగా నుడా చైర్మెన్ కేశ వేణు పాల్గొని నోట్ బుక్ లను పంపిణి చేశారు. నాగారంలోని రాజారం స్టేడియంలో కైసర్ స్పోర్ట్స్ ఆథార్టి ఆధ్వర్యంలో జరుగుతున్న అథ్లెటిక్ పోటీల విజేతలకు కేశ వేణు బహుమతులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జావేద్ ఆక్రం, ఖైసర్, మోయిన్ యూనిస్, హపీజ్ లాయక్, నవాజ్, తేజబ్ తదితరులు ఉన్నారు.

