- మల్లూరు నర్సరీలో నల్ల కవర్లో ఎరుపుగా మారిన మొక్కలు..
నిజాంసాగర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూరు గ్రామంలో హరితహారం నర్సరీలో ఎండిపోతున్న మొక్కలకు నీరు పోసేవారు కరువయ్యారు. అన్నిటికీ రూల్స్ ఉంటాయని అంటున్న గ్రామ కార్యదర్శికి ఇది తెలియకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కు తూట్లు పొడుస్తున్న ఇలాంటి అధికారులపై చర్యలు లెవా! అంటున్నారు. నీరు పెట్టకపోవడంతోనే నర్సరీలో మొక్కలు ఎండిపోతున్నాయని గ్రామస్తులు తెలిపారు.

