నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ లో జరిగిన పి డి ఎస్ యూ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని పి డి ఎస్ యూ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్.గౌతం కుమార్, జన్నారపు రాజేశ్వర్ తెలిపారు. యూనివర్సిటీ పి డి ఎస్ యూ అధ్యక్షులుగా ఎ.అక్షయ్ , ప్రధాన కార్యదర్శి కే.గౌతం రాజ్, ఉపాధ్యక్షులు టి.రవీందర్ , సహాయ కార్యదర్శి సాత్విక, కోశాధికారి జె.రాకేష్, కార్యవర్గ సభ్యులుగా జయంతి, ప్రిన్స్, దినేష్ కార్తీక్, వినీల్, మణికంఠ, హుస్సేన్, నికిల్, దేవిక, రాజేష్, లహరి, సాయి, ప్రవీణ, నవ్యలతో నూతన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవ ఎన్నుకున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ లో విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం, అసమానతలు లేని సమాజం కోసం, శాస్త్రీయ విద్య సాధనకై ఉద్యమిస్తామని నూతన కార్యవర్గం సభ్యులు తెలిపారు.

