నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మార్చి 17న ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో జరిగే జాతీయ సదస్సు కరపత్రాన్ని కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ గురువారం ఆవిష్కరించారు. రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం ఆధ్వర్యంలో “రసాయన, జీవశాస్త్రాలలో అభివృద్ధి చెందుతున్న ధోరణులు, సమకాలీన సవాళ్లు” అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం పాల్గొన్నారు.