హైదరాబాద్, బతుకమ్మ : సృష్టి ఫెర్టిలిటీ కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో నిందితురాలు డాక్టర్ నమ్రత నేరాంగీకర పత్రంలో పోలీసులు కీలక అంశాలను నమోదు చేశారు. ఈవివరాలు ఇలా ఉన్నాయి.. విజయవాడ, సికింద్రాబాద్, విశాఖ లల్లో ఫెర్టిలిటీ సెంటర్లు నడిపారు. సరోగసి పేరుతో నమ్రత రూ.20 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేశారు. ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు డబ్బులను ఆశ చూపి శిశువు విక్రయానికి ఒప్పందం చేసుకోవడంతో పాటు అనంతరం వారి నుంచి పిల్లల్ని కొనుగోలు చేశారు.
