బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మానవ హక్కులు బాధ్యతల గురించి ప్రజలందరికీ అవగాహన కలిగి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర మానవ హక్కుల కమిటీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఖలీల్ అన్నారు. సోమవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో మానవ హక్కుల సహాయ కమిటీ సమావేశాన్ని మానవ హక్కుల కమిటీ ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ చౌదరి శ్రీనివాస్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఖలీల్ మాట్లాడుతూ సమాజంలో మానవ హక్కుల గురించి ప్రతి పౌరునికి తెలిసి ఉండాలని, ప్రజలందరికీ మానవ హక్కులు, బాధ్యతలు తెలిసినప్పుడే సమాజం బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సహాయ కమిటీ సభ్యులు చౌదరి శ్రీనివాస్, జగన్ రెడ్డి, గంపల వెంకన్న , రాజు, బాబురావు, రాములు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
