జగిత్యాల, బతుకమ్మ : సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘యూనిటీ మార్చ్’ ను మంగళవారం ఎంపీ అర్వింద్ ప్రారంభించారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ , అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ , ఇతర జిల్లా స్థాయి అధికారులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


