27.7 C
Hyderabad

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం

Must read

📰 Generate e-Paper Clip

  • తడిసిన ధాన్యం కొనుగోలు వ్యవహారాన్ని వేగవంతం చేయాలి

 

బాన్సువాడ, బతుకమ్మ : వర్షాల కారణంగా ధాన్య తడిసిపోతున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి  పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ మండలం కిష్టాపూర్, చించోల్లి, బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. రెండు రోజులుగా కురిసిన వర్షాల ప్రభావంతో తడిసిన ధాన్యం కొనుగోలు వ్యవహారాన్ని వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా డీఎస్​వోతో ఫోన్‌లో మాట్లాడి లారీల కోసం ఎదురుచూడకుండా తూకంవేసిన ధాన్యం బస్తాలను వెంటనే రైస్​ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైస్​మిల్లర్లు కూడా ధాన్యం బస్తాలు మిల్లుకు చేరగానే తక్షణమే దింపుకొని రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, తూకం వేసిన బస్తాలు, ధాన్యం రాశులపై పాలథీన్ కవర్లు కప్పి రక్షించుకోవాలని రైతులకు సూచించారు.

More articles

Latest article